కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

16 Aug, 2016 18:08 IST|Sakshi
కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆదిలాబాద్: ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. గ్యాంగ్ స్టర్ నయీం మనుషులు తనను బెదిరించారని ఆయన తెలిపారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పోటీ నుంచి తనను తప్పుకోవాలని నయీం మనుషులు ఒత్తిడి చేశారని చెప్పారు. పోటీ నుంచి తప్పుకోకుంటే చంపుతామని బెదిరించారని తెలిపారు.

నల్లగొండ జిల్లాలో ప్రతి టీఆర్ఎస్ నాయకుడు నయీం అనుచరుడేనని ఆరోపించారు. నయీంతో కలిసి ఓ టీఆర్ఎస్ నాయకుడు కోట్ల రూపాయలు సంపాదించాడని వెల్లడించారు. నయీం డైరీలో ఉన్నవన్నీ టీఆర్ఎస్ నాయకుల పేర్లేనని పేర్కొన్నారు. డైరీలో ఉన్న పేర్లతో 99 శాతం టీఆర్ఎస్ నాయకులవేనని అన్నారు. నయీం ముఠా కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయాలని సూచించారు.

మరిన్ని వార్తలు