వ్యాను బోల్తా పడి ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం వెంకటాపురంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొల్లేరు వైపు చేపల మేత లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న పిళ్లా మోహన్రావు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. మోహన్రావు స్వగ్రామం మండలంలోని భువనపల్లి.