ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

18 Dec, 2016 23:59 IST|Sakshi
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత

కర్నూలు న్యూసిటీ: ఆధ్యాత్మికతతో మానిసక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ ఆ«ధ్యాత్మివేత్త శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్కుమార రామాను జీయరు స్వామి అన్నారు. ఆదివారం కర్నూలులోని జిల్లా గోరక్షణ మహాసంఘం (గోరక్షణశాల)లో ధనుర్మాస వ్రత మహాత్సవాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ... వారంలో ఒక్కరోజైనా దేవాలయాలకు వెళ్లి దేవున్ని దర్శించుకోవాలన్నారు. తమ సంపాదనలో కొంత పేదలకు దానం చేయాలన్నారు. గోరక్షణశాల మాజీ ధర్మకర్త మండలి సభ్యుడు శ్రీకాంత్‌ నాయుడు, గోరక్షణశాల సిబ్బంది రమణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు నాగేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు