పోలీసుల ఓవర్ యాక్షన్, వ్యక్తికి తీవ్రగాయాలు

13 Dec, 2015 19:47 IST|Sakshi

గుంటూరు: పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. పొన్నూరు మండలం చింతలపుడిలో పోలీసులు ఆదివారం చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారున్ని అకస్మాత్తుగా ఏఎస్ఐ లాగడంతో.. గమనంలో ఉన్న వాహనదారుడు కిందపడిపోయాడు. తీవ్రగాయాలయిన అతన్ని గుంటూరు జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చెకింగ్ పేరుతో పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ పట్ల ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు