'బాబు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి'

22 May, 2016 08:19 IST|Sakshi

విజయవాడ : హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు తరలి రావాల్సిందేనన్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నిర్ణయం సరైంది కాదని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్కే విలేకర్లతో మాట్లాడుతూ... ఇప్పటికే ప్రజలు, రైతులను మోసగించిన చంద్రబాబు... ఇప్పుడు ఉద్యోగులను కూడా అదే రీతిలో వంచిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆర్కే ఈ సందర్భంగా సూచించారు.

మరిన్ని వార్తలు