తిరుమల: తిరుమల శ్రీవారి సన్నిధిలో గత మూడు రోజులుగా తక్కువగా ఉన్న రద్దీ కొద్దిమేర పెరిగింది. శుక్రవారం ఉదయం సమయానికి 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లోపే పూర్తవుతోంది.