జిల్లాలో నిషేధాజ్ఞలు : ఎస్పీ

1 Nov, 2016 23:49 IST|Sakshi
కాకినాడ క్రైం : నెల రోజుల పాటు జిల్లాలో నిషేధాజ్ఞలు విధిస్తూ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టరాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెక్షన్‌-30 ప్రకారం శాంతి భద్రతలు, అంతర్గత భద్రత పరిరక్షణలో భాగంగా నవంబర్‌ ఒకటి నుంచి 30 వరకూ కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్‌ డివిజన్ల పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి  సమావేశాలు, ఆందోళనలు నిర్వహించరాదని, మైక్‌లతో ప్రచారం చేపట్టరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. 
 
మరిన్ని వార్తలు