జక్రాన్పల్లి(డిచ్పల్లి) : డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని జక్రాన్పల్లి మండలం చింతలూర్ గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన 52 కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసినట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాల వారు సోమవారం డిచ్పల్లి మండలం ఇందల్వాయి కి తరలి వచ్చి తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, ధర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపిని కలిసి విషయం తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..
బహిష్కరణకు గురైన ముదిరాజ్ కుటుంబాల వారికి గ్రామంలోని ఇతర కులస్తులు సహకరించరాదని, ఎవరైనా సహకరిస్తే వారిని సైతం బహిష్కరిస్తామని వీడీసీ సభ్యులు హెచ్చరించారని తెలిపారు. గ్రామానికి చెందిన ముత్తన్న కు సంబంధించిన ఐదు ఇసాల పట్టా భూమిని కాలువ నిర్మాణం కోసం ఇవ్వాలని వీడీసీ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ముదిరాజ్ కులపెద్దల ద్వారా ముత్తన్నపై ఒత్తిడి తెచ్చారు. అయితే తాను కోల్పోతున్న భూమికి నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే భూమి ఇచ్చేది లేదని ముత్తన్న స్పష్టం చేశాడు.
దీంతో తాము చెప్పిన మాట వినడం లేదనే సాకుతో గ్రామంలోని ముదిరాజ్ కులానికి చెందిన 52 కుటుంబాల వారిని సాంఘిక బహిష్కరణ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఇమ్మడి గోపి ఆధ్వర్యంలో బాధితులు జిల్లా కలెక్టర్ యోగితారాణా ను కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే ఈ విషయమై విచారణ జరపాలని డిచ్పల్లి సీఐ తిరుపతిని ఆదేశించినట్లు ఎంపీపీ గోపి తెలిపారు. కలెక్టర్ సూచన మేరకు జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
52 కుటుంబాల సాంఘిక బహిష్కరణ
Published Tue, Nov 1 2016 11:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement