చండూరు : పాము కాటుతో ఓ చేనేత కార్మికుడు మృతి చెందిన సంఘటన చండూరు మండల పరిధిలోని గట్టుప్పల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాపోలు శ్రీను(46) చేనేత వృత్తి పై ఆధార పడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం రాత్రి తన ఇంట్లో భార్య, పిల్లలతో కలిసి నిద్రపోయారు. మధ్య రాత్రి సమయంలో చేతిపై ఏదో పారినట్లుగా ఉండడంతో గమనించి ఆ పామును చంపేశారు. రాత్రి సమయంలో నాటు వైద్యం చేశారు. అనారోగ్యంగా ఉండడంతో ప్రాథమిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా పరిప్థితి విషమంగా ఉందనడంతో హైదరాబాద్లోని ఉస్మానియాకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉంది.