అతిగా మద్యం తాగి విద్యార్థి మృతి

2 Jan, 2017 23:50 IST|Sakshi
అతిగా మద్యం తాగి విద్యార్థి మృతి
నంద్యాల: అతిగా మద్యం తాగి బ్యాంక్‌ కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థి రామకృష్ణ(25) సోమవారం మృతి చెందాడు. ఒంగోలు పట్టణానికి చెందిన కిరాణం వ్యాపారి వెంకట సుబ్బారావుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తె లక్ష్మీ స్థానిక బ్యాంక్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొంది ఉద్యోగం సంపాదించింది. దీంతో  డిగ్రీ చదివిన రామకృష్ణను బ్యాంక్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించాడు. ప్రైవేటు గదుల్లో ఉన్న రామకృష్ణ..డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి, జనవరి 1వ తేదీ ఫుల్‌గా మద్యం తాగి స్నేహితులతో గడిపాడు. సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా నిద్ర లేచి బాత్‌రూంకు వెళుతూ కుప్పకూలిపోయాడు. వెంటనే సహచర విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినా కోలుకోలేక మృతి చెందాడు. ఇతనికి చికిత్స చేసిన వైద్యులు మద్యం అతిగా తాగినట్లు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. 
 
మరిన్ని వార్తలు