ఖమ్మం మామిళ్లగూడెం : ఏఎంసీ ద్వారా సుబాబుల్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే మద్దతు ధర కల్పించాలని కోరతూ బీజేపీ ఆధ్వర్యంలో శాసనసభా పక్ష నేత కిషన్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఐటీసీ పేపర్ ఇండస్ట్రీ యాజమాన్యం ఖమ్మం జిల్లా సుబాబుల్ రైతులపై వివక్ష పూరితమైన వైఖరిని అవలంబిస్తోందని తెలిపారు. వినతి అందంచినవారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, నాయకులు చిలుకూరి రమేష్, గల్లా సత్యనారాయణ, విద్యాసాగర్, యర్రం రాజుబెహర, కేపీ రెడ్డి పాల్గొన్నారు.