వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి

24 Aug, 2016 21:25 IST|Sakshi

సింహాద్రిపురం: వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సింహాద్రిపురం మండలం సుంకేశులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ కార్యకర్తలు కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో నలుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు