ఏటీఎంలో చోరీకి దొంగల విఫలయత్నం

12 Aug, 2016 23:29 IST|Sakshi

యెటింక్లయిన్‌కాలనీ : గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ౖయెటింక్లయిన్‌కాలనీ సింగరేణి స్కూల్‌ చౌరస్తాలోని ఎస్‌బీహెచ్‌ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫయత్నం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజీలో నమోదైన వివరాల ప్రకారం.. గతనెల 23న తెల్లవారుజామున 2.30 గంటలకు ముసుగులు ధరించి వచ్చిన నలుగురు యువకులు ఏటీఎం చోరీకి ప్రత్నించారు. ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు యువకులు ఏటీఎం ముందు నిల్చోగా లోపలికి వచ్చిన యువకుడు హెల్మెట్‌ పెట్టుకుని ముఖం కన్పించకుండా కర్చీఫ్‌ ముఖానికి అడ్డంగా కట్టుకున్నాడు. లోపలికి ఐరన్‌రాడ్‌తో వచ్చి సీసీ కెమెరాను పగులగొట్టాడు. అనంతరం మరో ముగ్గురు ఏటీఎం ముందు సీసీ కెమెరాలో పడకుండా ఖాళీబ్యాగు పట్టుకుని నిలబడ్డారు. ఈలోపు ఏదో హారన్‌ రావడంతో పారిపోయారు. అయితే ఏఐటీఎం ఉన్న నాలుగు సీసీ కెమెరాలు ధ్వంసం కావడంతో వాటిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన ఎస్‌బీహెచ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుటేజీలో దొంగలను పరిశీలిస్తే ఏటీఎం లూటీ చేసేందుకు పకడ్బందీగా వచ్చినట్లు తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు