నేడు సర్టిఫికెట్ల పరిశీలన

30 Mar, 2017 23:06 IST|Sakshi

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అందజేసిన కాపు, బలిజల దరఖాస్తులను  శుక్రవారం పరిశీలించనున్నట్లు బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగముణి తెలిపారు.  ఈమేరకు గురువారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. దరఖాస్తుల పరిశీలన పెన్నార్‌ భవన్‌ సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఉంటుందన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న గ్రూపు సభ్యులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, బ్యాంకు వివరాలతోపాటు జిరాక్స్‌ కాపీలతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–275539లో సంప్రదించాలన్నారు.

మరిన్ని వార్తలు