ఆదిలాబాద్ క్రైం : హైకోర్టు న్యాయమూర్తి, హైదరాబాద్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ హెచ్ఓడీ మెంబర్ జస్టిస్ బి.వెంకటేశ్వరరావు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బాసరకు రానున్నట్లు డీఆర్వో సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు బాసర చేరుకుంటారని, ఆ రాత్రి బాసర టీఎస్టీడీసీ గెస్ట్హౌస్లో బస చేస్తారని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సరస్వతి అమ్మవారిని దర్శించుకొని మనుమడికి అక్షరాభ్యాసం చేయిస్తారని వివరించారు. అదే సాయంత్రం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు.