నేడు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం

19 Jul, 2016 20:16 IST|Sakshi
నేడు లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా సమావేశం

సాక్షిప్రతినిధి, ఖమ్మం:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారన్నారు. జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, మండలస్థాయి కమిటీల నియామకంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలిపారు. సమీక్ష సమావేశానికి జిల్లాలోని పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు హాజరుకావాలన్నారు.
 

మరిన్ని వార్తలు