నీళ్ల బకెట్‌లో పడి బాలుడు మృతి

30 Dec, 2016 19:09 IST|Sakshi

నిజామాబాద్‌: జిల్లాలోని బోధన్‌ శక్కర్‌నగర్‌లో ఓ చిన్నారి నీళ్ల బకెట్‌లో పడి మృతిచెందాడు. తల్లి ప్రమీల స్నానం చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి చందు ప్రమాదవశాత్తు బకెట్‌లో పడిపోయాడు.

తల్లి వచ్చి చూసేసరికి బిడ్డ శవమై తేలాడు. దీంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు