రేపు జాబ్‌మేళా

5 Jun, 2017 22:53 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ :

బెంగళూరుకు చెందిన ఫెడరల్‌ ముఘల్‌ కంపెనీలో ట్రైనీ/ఆపరేటర్ల ఉద్యోగాలకు ఈనెల 7న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ. కళ్యాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులై 18–24 ఏళ్ల వయసులోపు అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయన్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారు బెంగళూరులోనే పని చేయాల్సి ఉంటుందన్నారు. వేతనం నెలకు రూ. 8500 నుంచి రూ.13000 దాకా ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల7న ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని ఉపాధి కల్పనాధికారి కార్యాలయానికి చేరుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు