మాజీ మంత్రి కాన్వాయి ఢీ కొని ... ఇద్దరికి గాయాలు

15 Sep, 2015 11:21 IST|Sakshi

నల్గొండ : నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమామాధవరెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయి... ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉమామాధవరెడ్డి కాన్వాయి సిబ్బంది వెంటనే స్పందించి... క్షతగాత్రులను నల్గొండలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు