గోదావరిఖని(పెద్దపల్లి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తరుణ్(25), నాగార్జున(26) బైక్పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు.
విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.