-
దశాబ్దం కల సాకారమైన వేళ
గోదావరిఖని: సింగరేణి పరిధిలోని గిరిజన ప్రాంతాల యువత జీవితాల్లో వెలుగులు నిండాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 665 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిలో 309 మంది యువకులకు ఆదివారం ఉద్యోగ పత్రాలను అందించింది. సింగరేణి గనుల విస్తరణతో భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులను సంస్థ యాజమాన్యం ఆదుకోవాలని దశాబ్దకాలంగా పోరాటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల గిరిజన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన యాజమాన్యం 2018లో రాత పరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత కొంతమంది దీనికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడంతో ఫలితాలు వెల్లడించకుండా నిలిపివేసింది. కాగా, గిరిజన యువతకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు కూడా 27 డిసెంబర్ 2021న సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏర్పడగా.. కోల్బెల్ట్ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సంస్థ సీఎండీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేలా చేశారు. దీంతో సమస్యలను పరిష్కరించి ఇటీవల పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలో 665 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆదివారం ఒక్కరోజే 309 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. దశలవారీగా మిగతా వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సంగరేణి వర్గాలు తెలిపాయి. తమ పోరాటం ఫలించిందని, దశాబ్దాల కల నెరవేరిందని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల గిరిజన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూలీ చేస్తూ బతుకుతున్నా.. సింగరేణి ఉద్యోగం రావ డం సంతోషంగా ఉంది. డిగ్రీ చదివినా ఉద్యోగం లేక కూలీ పనిచేసుకుంటున్న. 2018లో సింగరేణిలో పరీక్ష రాశా. గిరిజనులకు ఉద్యోగాలను ప్రకటించడం ఆనందంగా ఉంది. – మూడు రఘు, చౌడవరంతండా, సత్తుపల్లి సంతోషంగా ఉంది మాది పేద కుటుంబం. బీ ఫార్మసీ పూర్తి చేశా. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్స్కు హాజరైనా ఉద్యోగం రాలే దు. సింగరేణి పరీక్షలో పాల్గొన్నా. ఫలితాలు ఆలస్యమైనా, సంస్థలో ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. – లూనావత్ రమేశ్, నర్సింహులపేట, మహబూబాబాద్ ఊహించలేదు.. సింగరేణిలో ఉద్యోగం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఫలితాలు పెండింగ్లో పె ట్టారు. ఉద్యోగం రావడం మర్చిపో లేని రోజు. – ఇస్లావత్ రాజ్కుమార్, రాజీవ్నగర్తండా, యైటింక్లయిన్కాలనీ చిక్కులు అధిగమించి గిరిజన యువతకు ఉద్యోగాలిచ్చే విషయంలో అనేక న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఇబ్బందులను అధిగమించి 309 మందికి ఒకేరోజు ఉద్యోగాలివ్వ డం సంతృప్తినిచ్చింది. మిగతా వారికి కూడా దశల వారీగా ఉద్యోగాలిస్తాం. – బలరాంనాయక్, డైరెక్టర్, సింగరేణి -
సింగరేణిలో సమ్మె సైరన్
శ్రీరాంపూర్ (మంచిర్యాల): సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సుదీర్ఘ విరామం తర్వాత సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి సమ్మెకు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసి ప్రైవేటుకు అప్పగించేం దుకు చేస్తున్న ప్రయత్నాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చర్యలను నిరసిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఇల్లందు క్లబ్లో 5 జా తీయ సంఘాలతోపాటు సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు జేఏసీగా ఏర్పడి ఈ నిర్ణయం తీసుకున్నారు. టీబీజీకెస్ నేతలు ఇప్పటికే కొద్దిరోజుల కిందట సమ్మెనోటీసు ఇచ్చారు. జేఏసీ కూడా సింగరేణి యాజమా న్యానికి మంగళవారం మరో నోటీసు ఇవ్వనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామస్వామి తెలిపారు. కార్మిక నేతలు మొత్తం 9 డిమాండ్లను నోటీసులో పేర్కొన్నారు. -
సింగరేణిలో ‘సౌర’ కాంతులు
గోదావరిఖని (రామగుండం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టిసారించింది. తాజాగా శనివారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో మరో 81 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 129 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 90 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభ దశలో ఉన్నా యి. మరో 81 మెగావాట్ల సోలార్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. సంస్థ పరిధిలోని 1,500 ఎకరాల్లో మొత్తం 300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల కోసం రూ.1, 350 కోట్లు ఖర్చు చేయాలని బోర్డు నిర్ణ యించింది. ఒక మెగావాట్ విద్యుత్ కోసం రూ.4.28 కోట్ల బడ్జెట్, నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించి ప్లాంట్లు ఏర్పా టు చేస్తోంది. మణుగూరులో 30 మెగావా ట్లు, జైపూర్ థర్మల్ ప్లాంట్ ఆవరణలో 10 మెగావాట్లు, ఆర్జీ–3 ఏరియాలో 50 మెగావాట్లు, ఇల్లెందులో 39 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల పనులు జరుగుతున్నా యి. వీటిని భారత్హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ నిర్మి స్తోంది. మణుగూరు ఏరియాలో నిర్మించిన 30 మెగావాట్లు, సింగరేణి థర్మల్ ప్లాంట్లో నిర్మించిన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాయి. రెండోదశ కేంద్రాలు వేగవంతం రెండోదశలో నిర్మాణం 90 మెగావాట్ల సో లార్ విద్యుత్ కేంద్రాలు ప్రారంభ దశలో ఉన్నాయి. వీటిలో 10 మెగావాట్లు భూపాలపల్లి, 43 మెగావాట్లు మందమర్రి, 37 మెగావాట్ల ప్లాంట్ను కొత్తగూడెంలో ఏర్పా టు చేయనున్నారు. వీటిని అదానీ సంస్థ నిర్మిస్తోంది. మూడో దశలో 81 మెగావాట్లు.. మూడో దశలో 81 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 32 మెగావాట్లు ఓసీపీ డంప్యార్డులపై, 15 మెగావాట్లు సింగరే ణి ప్రాంతంలోని జలాశయాలపై, 34 మెగా వాట్ల ప్లాంట్లు సంస్థలోని స్థలాల్లో నిర్మించనున్నారు. జలాశయాలపై 500 మెగావాట్లు.. రాష్ట్రంలో ఉన్న భారీ జలాశయాలపై మరో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజ మాన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలసి సంస్థ నివేదిక రూపొందించింది. త్వరలో దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. -
సింగరేణి లాభాలు రూ.993 కోట్లు!
గోదావరిఖని: అసలే కరోనా వైరస్.. మార్చి నెల వేతనంలో 50 శాతం కోత.. పెరిగిన ఖర్చులు.. పెండింగ్ బకాయిల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం లాభాలను సింగరేణి యాజమాన్యం ప్రకటిస్తుందా లేదా అన్న ఉత్కఠకు తెరపడింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ లాభాలు ఆరు నెలల తర్వాత యాజమాన్యం తేల్చినట్లు సమాచారం. రూ.993 కోట్లు సంస్థకు లాభాలు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్లో శనివారం జరిగిన బోర్ట్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లాభాలు తేల్చినట్లు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో ఇరవై ఏళ్ల క్రితం లాభాల్లో కార్మికులకు వాటా చెల్లింపు ప్రారంభమైంది. సంస్థ నష్టాల్లో ఉన్న కాలంలో గుర్తింపు యూనియన్గా ఉన్న ఏఐటీయూసీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా చెల్లించేలా అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఇలా 1999లో మొదలైన కార్మికుల లాభాల వాటా పంపిణీ నేటికీ కొనసాగుతోంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన వాస్తవ రూ.1,766 కోట్ల లాభాలను యాజమాన్యం ప్రకటించింది. అందులో కార్మికుల వాటా 28 శాతం వాటా చెల్లించింది. ఒక్కో కార్మికునికి సగటున రూ.లక్ష వరకు లాభాల బోనస్ అందింది. ఈసారి భారీగా తగ్గిన లాభాలు సింగరేణిలో 2019–20 ఆర్థిక సంవత్సరంలో లాభాలు భారీగా తగ్గాయి. ఈసారి రూ.993 కోట్లుగా చెబుతున్నారు. గతేడాది ఇదే లాభాల వాటా రూ.1766 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే సగానికి తగ్గినట్లుగా తెలుస్తోంది. కార్మికులకు చెల్లించే బోనస్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. 35 శాతం వాటాకు డిమాండ్ గతేడాది సింగరేణి సాధించిన లాభాల్లో 28 శాతం కార్మికుల వాటా యాజమాన్యం చెల్లించగా, ఈసారి 35 శాతం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి లాభాలు ఎక్కువగా వస్తాయని ఆశించారు. లాభాల వాటా ప్రకటన ముఖ్యమంత్రి పరిధిలో ఉండటంతో గుర్తింపు పొందిన యూనియన్ టీబీజీకేఎస్ నేతలు కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో కలసి సీఎంను కలవాలని చూస్తున్నారు. 23న లాభాల వాటా ఇప్పిస్తాం కార్మికులకు లాభాల వాటా ఈ నెల 23న ఇప్పిస్తాం. మార్చిలో నిలిపివేసిన సగం వేతనం కూడా ఇదే రోజున చెల్లించేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కోవిడ్తో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఇప్పిస్తాం. దీనికి యాజమాన్యం అంగీకరించింది. త్వరలో కోల్బెల్ట్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలసి లాభాల వాటాపై చర్చిస్తాం. – బి.వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మార్చి వేతనంతో లాభాల వాటా చెల్లించాలి సింగరేణి లాభాల్లో ఈసారి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. కోవిడ్ నేపథ్యంలో గత మార్చిలో కార్మికుల వేతనంలో కోత విధించిన 50 శాతం కూడా ఈ నెలలో చెల్లించాలి. దసరా ఆదివారం వస్తున్నందున కార్మికులు నష్టపోకుండా పండుగకు ముందే లాభాల వాటా చెల్లించేలా చూడాలి. – కెంగర్ల మల్లయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు లాభాల్లో 35 శాతం వాటా చెల్లించాలి సంస్థ లాభాలు రూ.993 కోట్లుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తేల్చిన నేపథ్యంలో అందులో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి. మార్చిలో కోత విధించిన 50 శాతం వేతనం కూడా లాభాల వాటాతో కలిపి ఇవ్వాలి. ఇప్పటికే లాభాల ప్రకటన ఆలస్యమైంది. కార్మికులకు ఇబ్బంది కలుగకుండా యాజమాన్యం వెంటనే చెల్లించేలా చూడాలి. -
నాటి వైఎస్సార్ నుంచి నేటి కేసీఆర్ వరకు..
సాక్షి, గోదావరిఖని (కరీంనగర్) : రాష్ట్ర, జాతీయస్థాయి అతిథులకు నిలయంగా , అద్భుతమైన వంటకాలతో ప్రత్యేకతను చాటుకుంటోంది రామగుండం ఎన్టీపీసీ జ్యోతిభవన్. 2004లో ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అనేక మంది ప్రముఖులు ఇక్కడి గృహంలోనే బస చేశారు. అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నేటి సీఎం కె.చంద్రశేఖర్రావుతో సహా ఈ ప్రాంతానికి పర్యటనకు వస్తే ఇదే అతిథిగృహాన్ని ఎంచుకోవడం విశేషం. తాజాగా సీఎం ప్రత్యేకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి ఈప్రాంతానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కూడా ఇదే అతిథి గృహానికి చేరుMýనారు. మరోసారి ఈ గెస్ట్హౌజ్ విశిష్టస్థానాన్ని సంపాదించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం ప్రత్యేకంగా వచ్చే అతిథులు బస చేసేందుకు జ్యోతిభవన్ గెస్ట్హౌజ్ నిర్మించారు. 1986లో అప్పటి డైరెక్టర్ వి.సుందరరాజన్ గెస్ట్హౌజ్ను ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు అతిథుల సేవలో తరిస్తోంది. 2006లో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈప్రాంత పర్యటనకు వచ్చినపుడు ఇదే గెస్ట్హౌజ్లో బస చేశారు. ఆతర్వాత 2004లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఆర్వీ సాహి గెస్ట్హౌజ్లో బస చేశారు. అలాగే 2006లో న్యూజిలాండ్కు చెందిన విదేశీయులు ఇదే గెస్ట్హౌజ్లో విడిది చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మదన్మోహన్ బి లోకూర్ 2011లో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇదే గెస్ట్హౌజ్లో ఆతిథ్యం స్వీకరించారు. ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పీసీ బోస్ 2012లో ఈ ప్రాంతానికి వచ్చారు. అలాగే సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదిలో రెండుసార్లు జ్యోతిభవన్లో బస చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రశాంతంగా ఉండే గెస్ట్హౌజ్లో విశ్రాంతి తీసుకునేందుకు ఎంచుకున్నారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జ్యోతిభవన్లోనే బస చేశారు. చదవండి: మేడం వచ్చారు భవనం ప్రత్యేకతలు ఇవే.. చుట్టూ పచ్చదనంతో పరుచుకున్న పచ్చిక, విశాలమైన రోడ్లు, కాలుష్యానికి ఆమడదూరంలో గెస్ట్హౌజ్ నిర్మించడం ప్రత్యేకత సంతరించుకుంది. 1986లో ప్రారంభించిన గెస్ట్హౌజ్ ఎన్టీపీసీ అతిథుల కోసం కేటాయించారు. అయితే గెస్ట్హౌజ్ ప్రాంగణం విశాలంగా ఉండడంతోపాటు రాష్ట్ర, కేంద్రాల నుంచి వచ్చే అతిథులు బస చేసేందుకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ కూడా గెస్ట్హౌజ్కు సమీపంలోనే ఉండడంతో వీఐపీలు బస చేసేందుకు మరింత అనుకూలంగా మారింది. నిరంతర విద్యుత్ సరఫరా, అతిథులను ఒప్పించి మెప్పించే వంటకాలతోపాటు అన్ని ఏర్పాట్లు ఇందులో ఉండడంతో అతిథులు ఈ జ్యోతిభవన్లోనే ఉండేందుకు మక్కువ చూపుతు న్నారు. ఇండియన్ కాఫీ హౌజ్ ఆతిథ్యం గెస్ట్హౌజ్లో బస చేసే వారికోసం ఇండియన్ కాఫీ హౌజ్ ద్వారా నార్తిండియన్ వంటకాలు తయారు చేస్తున్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం అతిథులకు వడ్డించేందుకు ఇండియన్ కాఫీ హౌజ్ను కాంట్రాక్ట్ ద్వారా కేటాయించింది. నార్తిండియన్లతోపాటు తెలంగాణ ప్రాంత అతిథులకు కూడా ఇక్కడి వంటకాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement