సర్వజనాస్పత్రిలో నీటి కష్టాలు

16 Apr, 2017 22:57 IST|Sakshi
సర్వజనాస్పత్రిలో నీటి కష్టాలు

ప్రభుత్వ సర్వజనాస్పత్రి వార్డుల్లో వాటర్‌ కూలర్లు ఉన్నప్పటికీ నీళ్లు రావడం లేదు. ఫలితంగా నిత్యం ఆస్పత్రికి వచ్చే వందలాది మంది రోగులు, వారి బంధువులు గుక్కెడు నీటికీ అవస్థలు పడుతున్నారు. బాటిళ్లు తీసుకుని ఆస్పత్రి ఆవరణలో ఉన్న తాగునీటి ప్లాంట్‌ వద్దకు పరుగు తీస్తున్నారు. దాహమేసిన ప్రతిసారీ ఇక్కడికి రావాలంటే ఇబ్బందిగా ఉందని, వేసవి నేపథ్యంలో వార్డుల్లోనే మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
- అనంతపురం మెడికల్‌

>
మరిన్ని వార్తలు