నీటి ట్యాంకర్‌ బోల్తా

4 Sep, 2016 22:14 IST|Sakshi
నీటి ట్యాంకర్‌ బోల్తా

హిందూపురం అర్బన్‌ : పట్టణంలోని పులమతి రోడ్డు గంగమ్మ గుడి వెనుక 10వ వార్డులో ఆదివారం నీటి ట్యాంకర్‌ బోల్తా పడింది. వార్డులో రోడ్డు, డ్రైన్లు లేకపోవడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే డ్రైవర్‌ అప్రమత్తమై ఒక్కసారిగా పక్కకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం జేసీబీ యంత్రాన్ని తీసుకువచ్చి ట్యాంకర్‌ను సరి చేసి రోడ్డుపైకి తీసుకువచ్చారు. రోడ్లు సరిగా వేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు