గుంటూరు రూరల్: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. గుంటూరు రూరల్ మండలం బుడంపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామం సమీపంలోని రైల్వే ట్రాక్పై మంగళవారం రాత్రి ఓ మహిళ(30), ఇద్దరు పిల్లలతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం గమనించిన రైల్వే పోలీసులు మృతదేహాలను అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.