జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలి

19 Jul, 2016 19:53 IST|Sakshi

జహీరాబాద్‌: జహీరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌ చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటిని 26వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలలో గోవింద్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ బి.రాజు, పార్టీ నాయకులు ఎస్‌.నారాయణ, జి.అంజన్న, ఎస్‌.హన్మంతు, పి.నారాయణ, కృష్ణారెడ్డికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి వై.నరోత్తం సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు డాక్టర్‌ చంద్రశేఖర్, జలాలుద్దీన్, సుధీర్‌ భండారి, రాచప్ప, నేత్రయ్య, జగన్మోçßæన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మల్లయ్యస్వామి, రాంచంద్రారెడ్డి, టి.రాములు, మాజీద్, ఆర్‌.రాజు, వీర్‌శెట్టి, ఎన్‌.జి.నర్సింహులు, ఓంప్రకాష్, జగన్, అంజయ్య, జనార్ధన్‌రెడ్డి, టి.శివన్న, బి.రాములు, వెంకట్‌లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు