పాదాల సంరక్షణకు...

3 Jan, 2020 07:47 IST|Sakshi

వెడల్పాటి బేసిన్‌లో... వేడినీరు, ఉప్పు, నిమ్మకాయరసం వేసి, అందులో పాదాలను అరగంటసేపు ఉంచి, బ్రష్‌తో రుద్దాలి. ఇలా తరచు చేస్తుండ్రం వల్ల కాలి పగుళ్లు పూర్తిగా పోతాయి.
కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని వేసి చిక్కగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు ప్యాక్‌లా వేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలరోజుల పాటు ఇలా చేస్తే పాదాల పగుళ్లు మాయమైపోతాయి. ఎండ వల్ల ఏర్పడిన నలుపూ పోతుంది.
పగుళ్లు ఉన్న చోట మెత్తగా రుబ్బిన గోరింటాకు పెట్టి, ఎండాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే క్రమంగా పగుళ్లు తగ్గుముఖం పడతాయి.

మరిన్ని వార్తలు