మేనికి బొప్పాయి

28 Feb, 2019 03:02 IST|Sakshi

బ్యూటిప్స్‌

ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. 

►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్‌ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 

►ఇక ఈ కాలం సన్‌ప్రొటెక్షన్‌ లోషన్లు, మాయిశ్చరైజర్‌ని ఎంపిక చేసుకొని వాడాలి. వీటిని బయటకు వెళ్లడానికి ముందు 10 నిమిషాల ముందు రాసుకుంటే ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. 

►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. 

►శిరోజాలకు వారానికి ఒకసారి కండిషనర్‌ను తప్పక ఉపయోగించాలి. అరటిపండు గుజ్జును తలకు పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు.

►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి.

మరిన్ని వార్తలు