రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురి మృతి

30 Jan, 2016 13:07 IST|Sakshi

హైదరాబాద్: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘటన ఛత్తిస్‌గఢ్ లోని సుక్మ జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమడుగు గ్రామ సమీపంలో శనివారం జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో వంజం శాంతి, వంజం పొజ్జెలు మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరు పాలమడుగు రేంజ్ కమిటీ మిలీషియా సభ్యులు. వీరి వద్ద నుంచి ఒక పిస్టల్, రెండు తుపాకులు, డిటోనేటర్లు, ఇన్సాస్, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్‌లో వాడే గుండ్లను స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటనలో..
బీజాపూర్ జిల్లా ఆవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పున్నూరు గ్రామ సమీపంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు శిక్షకుడిగా పని చేస్తున్న రాంసు అనే మిలిటెంట్ మృతిచెందాడు. ఇతని వద్ద 8 ఎంఎం పిస్టల్ లభించింది.

మరిన్ని వార్తలు