భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్: ముగ్గురి మృతి

2 Aug, 2017 17:00 IST|Sakshi

బర్వాని: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లున్న ట్రక్ అదుపుతప్పి గ్రామదేవత ఊరేగింపులో పాల్గొంటున్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..  పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ సంఘటన బర్వాని జిల్లాలోని మౌడా గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామ దేవత ‘దశ’ అమ్మవారి ఊరేగింపు జరుగుతున్న సమయంలో అటుగా వచ్చిన ట్రక్ అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లింది.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలపారు. విషయం తెలుసుకున్న పన్సేమాల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు