హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల తేదీని మార్చినట్టు సమాచారం. ఈ నెల 12 న విడుదల కానున్నట్టు ముందు ప్రకటించిన అధికారులు తర్వాత ఫలితాల విడుదల తేదీని ఈ నెల 11 కు మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 11 న ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.