మేడారం వద్ద హోం మంత్రి మొక్కులు చెల్లింపు

17 Feb, 2016 16:57 IST|Sakshi

వరంగల్ జిల్లా మేడారం క్షేత్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మేడారం వచ్చిన ఆయన అమ్మవారి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చానన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర పండుగగా మేడారం జాతరను నిర్విహిస్తున్నామని... రెండేళ్ల తర్వాత వచ్చే జాతరను జాతీయ ఉత్సవరంగా నిర్వహిస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు