కారు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి

7 Aug, 2017 12:01 IST|Sakshi
హైదరాబాద్‌: సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విష్ణునగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న రాజుకు రెండేళ్ల కుమార్తె చైత్ర ఇంటి ముందు ఆడుకుండగా గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు