ఏఐసీసీ ‘రీసెర్చ్‌’ కార్యదర్శిగా ఆమేర్‌ జావెద్‌

13 Feb, 2018 04:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) రీసెర్చ్‌ విభాగం కార్యదర్శిగా హైదరాబాద్‌కు చెందిన ఆమేర్‌జావెద్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదం మేరకు ఏఐసీసీ రీసెర్చ్‌ విభాగాన్ని ప్రకటిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ ద్వివేది సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇందులో కార్యదర్శిగా జావెద్‌ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. జావెద్‌ గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌చార్జిగా ఉన్నారు.

మరిన్ని వార్తలు