'ఇద్దరు సీఎంలు ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారు'

6 May, 2016 14:06 IST|Sakshi

హైదరాబాద్: అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ అంబలి కేంద్రాలు పరువు తక్కువ అనుకుంటున్న కేసీఆర్ అన్నదానం చేయాలని సూచించారు. రూ. 4600 కోట్లతో ప్రజలకు కరువు సాయం చేయోచ్చని.. కానీ ఆ డబ్బులతో ఎమ్మెల్యేలతను సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ దగ్గర ప్రత్యేక హోదా గురించి మాట్లాడని చంద్రబాబు కమ్యూనిస్టులను తిట్టడం హాస్యాస్పదమన్నారు. ఊసరవెల్లిలో అధికార పార్టీ నేతలే రంగులు మార్చుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు