డయాలసిస్ చికిత్స పొందుతున్న ఓ మహిళ ఉస్మానియా ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్నగర్కు చెందిన యాదమ్మ(50) కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతోంది. ఈ మేరకు డయాలసిస్ చికిత్స కోసం రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో చేరింది. కాగా తాను త్వరలో చనిపోతాననే ఆందోళనతో మానసికంగా కుంగిపోయి మనస్థాపానికి గురై భవనంపై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యాదమ్మ అక్కడికక్కడే చనిపోయింది.