కొనసాగుతున్న గణేష్‌ శోభాయాత్ర

9 Sep, 2014 09:17 IST|Sakshi

హైదరాబాద్ : గణేష్ శోభాయాత్ర మంగళవారం కూడా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం గణనాధులు ట్యాంక్బండ్ వద్ద బారులు తీరాయి. భక్తులతో ఆ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.  మరోవైపు ఖైరతాబాద్ లంబోదరుడి శోభాయాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. దాంతో వినాయకుడి నిమజ్జనం ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో జరగవచ్చని అంచనా. కాగా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే  నిమజ్జనాల కోసం ట్యాంక్‌బండ్‌పై 22, ఎన్టీఆర్ మార్గ్‌లో 9 క్రేన్లను ఏర్పాటు చేశారు.

 

మరిన్ని వార్తలు