సాక్షి, హైదరాబాద్: అమరుల త్యాగాలతో, సోనియా గాంధీ చిత్తశుద్ధితో ఏర్పాటైన రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చి మంత్రి పదవిలో ఉన్న కేటీఆర్ బతుకు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్రెడ్డి సూచించారు.
గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు కాపలాకుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్, ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు కూర్చున్నారో చెప్పాలన్నారు. అవినీతి సొమ్ముతో తెగబలిసిన కేటీఆర్ సంగతిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింతర్వాత తేలుస్తామని హెచ్చరించారు.