కుషాయిగూడలో వ్యక్తి ఆత్మహత్య

30 Sep, 2016 16:31 IST|Sakshi
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే డి.సురేష్(35) అనే వ్యక్తి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సురేష్‌కు భార్యా ఇద్దరు పిల్లలున్నారు.
 
మరిన్ని వార్తలు