ముస్లిం ఉద్యోగులకు పని వేళల కుదింపు

5 Jun, 2016 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు వీలుగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు పని వేళలను కుదించింది. అన్ని కార్యాలయాలు, పాఠశాలల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ గంట ముందుగా విధుల నుంచి వెళ్లేందుకు అనుమతిచ్చింది.

ఈ మేరకు శనివారం అన్ని కార్యాలయాలకు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా సర్క్యులర్ జారీ చేశారు. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులను ప్రభుత్వ పనిదినాలన్నింటా సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతించాలని అందులో పేర్కొన్నారు. నెలవంకను బట్టి రంజాన్ మాసం ప్రారంభమయ్యే జూన్ 6 లేదా 7వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఈ వెసులుబాటును ఇస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు