మొబైల్ షోరూంలో భారీ చోరీ

24 Feb, 2016 14:50 IST|Sakshi

హైదరాబాద్‌: నగరంలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని ప్రముఖ మొబైల్ షోరూంలో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. మొబైల్ షోరూమ్‌ గోడకు కన్నం వేసిన దొంగలు సుమారు 10 లక్షలు విలువ చేసే 74 సెల్‌ఫోన్‌లను, 27వేల నగదును దొచికెళ్లారు
బుధవారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన షాపు సిబ్బంది వెంటనే పోలీసుకులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొబైల్ షాపునకు చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

సీసీ కెమెరాల ఫుటేజీ నుంచి తప్పించుకునేందుకు దొంగ నల్లదుస్తులు, మొఖానికి మాస్క్, గ్లౌజేస్ వేసుకొని దొంగతనానికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ వివి కమలాసన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సీసీ ఫుటేజీలో ఓ దొంగ చోరికి పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. ముందస్తు చర్యగా నల్లదుస్తులు, మాస్కులు ధరించడాన్ని బట్టి చూస్తే దొంగతనం నైపుణ్యం గలిగిన వాడై ఉంటాడని ఈ దొంగను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు