'వాస్తవాలు తెలుసుకుని కోదండరాం మాట్లాడాలి'

27 Jul, 2016 12:48 IST|Sakshi

హైదరాబాద్ : టి జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాంపై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్. నీరంజన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో విపక్షాల ఆరోపణలను పట్టుకుని ప్రో. కోదండరాం మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోదండరాంకు ఆయన హితవు పలికారు. దొంగలతో కలసి ప్రజలను మభ్యపెట్టేందుకు కోదండరాం యత్నిస్తున్నారని నీరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు