మెక్సికో: మెక్సికోలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణీకులతో ఉన్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో 10 మృతి చెందగా 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని తములిపాస్ రాష్ట్రంలో జరిగింది. ఈఫ్ న్యూస్ కథనం మేరకు ప్యాసెంజర్ బస్సు మెక్సికో నగరం నుంచి రియోనస్ బయలు దేరింది.
రాత్రి 7.30 గంటల సమయంలో రుంబో సమీప రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో బస్సు పల్టీలు కొట్టి 50 అడుగుల దూరంలో పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో సహా 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.