ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి

24 Feb, 2018 03:52 IST|Sakshi

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు శుక్రవారం కారుబాంబులతో ఆత్మాహుతి దాడికి పాల్పడి 18 మంది ప్రాణాలు తీశారు.  పేలుడు పదార్థాలతో నిండిన వాహనం మొగదిషులో తిరుగుతోందని సోమాలియా హోం మంత్రి గురువారమే హెచ్చరించారు. అయినా భద్రతా దళాలు పేలుళ్లను అడ్డుకోలేకపోయాయి. సోమాలియా నిఘా విభాగం ప్రధాన కార్యాలయం వద్ద తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు సమీపంలో రెండో దాడి చోటుచేసుకుంది. 

మరిన్ని వార్తలు