భారత ఎంబసీ సమీపంలో భారీ పేలుడు

27 Jan, 2018 15:46 IST|Sakshi

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబుల్‌ లో శనివారం భారీ పేలుడు చోటు చేసుకుంది. భారత రాయభార కార్యాలయానికి 400 మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఓ దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడిలో 95 మంది మృతిచెందగా, 158మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మూడు సార్లు భారీ పేలుడు శబ్ధం వినిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ దాడి తమ పనేనని తాలిబన్లు ప్రకటించారు. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఆఫీసులు, స్వీడీష్‌ మిషన్స్‌, హై పీస్‌ కౌన్సిల్‌లు కూడా ఆత్మాహుతి దాడి జరిగిన స్థలానికి సమీపంలో ఉన్నాయి. ఆత్మాహుతి దాడికి ఓ అంబులెన్స్‌ను వాడినట్టు అఫ్గాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వహీద్‌ మజ్రూహ్‌ తెలిపారు. భారత రాయభార కార్యలయంలో పని చేస్తున్న వారందరూ సురక్షితంగా ఉన్నట్టు విదేశాంగమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు