ట్రంప్‌నకు కిమ్‌ దేశం షాక్‌

16 May, 2018 08:59 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

ప్యాంగ్‌యాంగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉత్తరకొరియా షాక్‌ ఇచ్చింది. అణ్వస్త్రాల నిరాయుధీకరణ, కొరియా యుద్ధానికి అధికారికంగా ముగింపు పలకడంపై దక్షిణ కొరియాతో జరగుతున్న చర్చలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా-దక్షిణ కొరియాలు మిలటరీ విన్యాసాలు చేయడానికి సిద్ధమవుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది.

ఇలా చేయడం ఉత్తరకొరియాను రెచ్చగొట్టడమేనని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో ట్రంప్‌-కిమ్‌ జాంగ్‌ ఉన్‌ల మధ్య జరగాల్సిన భేటీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఉత్తరకొరియాను మాటలతో లొంగదీశానని తనకు తాను గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్‌నకు ఇది గట్టి ఎదురుదెబ్బే.

మరిన్ని వార్తలు