బర్త్ డే రోజే తీవ్ర విషాదం

26 Jun, 2017 14:09 IST|Sakshi
బర్త్ డే రోజే తీవ్ర విషాదం

లండన్ :
పుట్టిన రోజునాడే ఓ యువతికి జీవితాంతం మరిచిపోలేని దురదృష్టకర సంఘటన ఎదురైంది.  వివరాలు.. బిజినెస్ మేనెజ్మెంట్ విద్యార్థిని రేషమ్ ఖాన్(21), తన కజిన్ జమీల్ ముక్తార్(37)తో పుట్టిన రోజు వేడుక చేసుకోవాలనుకుంది. తన 21వ ఏట ఆడుగుపెట్టిన సందర్భంగా జమీల్తో కలిసి తూర్పు లండన్లోని బెక్టన్ నుంచి కారులో బయలుదేరారు. రెడ్ సిగ్నల్ పడటంతో కారు ఆపారు. ఆ సమయంలో ఇద్దరూ కారు అద్దాలను దించి ఉంచారు.

అదే సమయంలో ఓ దుండగుడు చేతిలో యాసిడ్ బాటిల్తో వచ్చి క్షణాల్లోరేషమ్ ఖాన్ ,జమీల్ ముక్తార్ల పై యాసిడ్తో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలతోనే వేగంగా నడిపే క్రమంలో కారు ఫెన్సింగ్ను ఢీకొట్టింది. అనంతరం ఇద్దరు కిందకు దిగి బట్టలు విప్పి కాపాడండి అంటూ బిగ్గరగా అరుస్తూ రోడ్డుపైనే అటూ ఇటుగా పరిగెత్తారు. 45 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి వీరిద్దరిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు.

జమీల్ ముక్తర్ చేతులు, కాళ్లు, వీపు, మెడ, మొహానికి కుడివైపు కాలిన గాయాలయ్యాయి. కుడి కన్నుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం జమీల్ కోమాలో ఉన్నాడు. రేషమ్ ఖాన్ చర్మం పలుచోట్ల కాలిపోయి, ఎడమ కంటికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.


కాగా, తమపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై రేషమ్ ఖాన్ స్పందించారు. 'ప్రస్తుతం కుప్పకూలిపోయిన స్థితిలో నేను ఉన్నా. నా మునుపటి జీవితం ఇక తిరిగి రావడం కలే అనుకుంటా. అసలు యూకేలో యాసిడ్ దాడులు జరుగుతాయని నేను ఇప్పటి వరకు వినలేదు. దాడి తర్వాత నొప్పి భరించలేకపోయా. కారు విండో దింపడానికి ప్రయత్నించా. దుండగుడి నుంచి దూరంగా వెళ్లడానికి మా కజిన్ ప్రయత్నించాడు. నా దుస్తులు నా కళ్ల ముందే కాలిపోవడం చూశా' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు