రిఫ్రిజిరేటర్‌లో 41 మంది

5 Nov, 2019 03:58 IST|Sakshi

తెస్సలోనికి: ట్రక్‌లో దాక్కొని గ్రీస్‌ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన 41 మందిని పోలీసులు గుర్తించారు. ట్రక్‌ రిఫ్రిజిరేటర్‌లో వలసదారులు ఉండగా, జార్జియాకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. జాంతి, కొమొతిని నగరాల మధ్య ఈ ట్రక్కును కనుక్కున్నట్లు పోలీసులు వెల్లడించారు. దాక్కున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, అవసరమైన ఏడు మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. వీరు అఫ్గానిస్తాన్‌ వాసులుగా భావిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు