కాబుల్‌లో భీకర పేలుళ్లు..

21 Mar, 2018 14:23 IST|Sakshi
కాబుల్‌ యూనివర్సిటీ (ఫైల్‌ ఫొటో)

కాబుల్‌: దక్షిణాసియా దేశం ఆఫ్ఘనిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. రాజధాని కాబుల్‌ నగరంలో బుధవారం జరిగిన వేర్వేరు పేలుళ్లలో సుమారు 25 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబుల్‌ నగరంలోని కాబుల్‌ యూనివర్సిటీ, అలీ అబాబ్‌ ఆస్పత్రుల వద్ద ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారని, ప్రస్తుతం సహాయబృందాలు రంగంలోకి దిగాయని స్థానిక మీడియా తెలిపింది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు