తైవాన్‌లో రైలు ప్రమాదం.. 22 మంది మృతి

21 Oct, 2018 20:00 IST|Sakshi

ఇలాన్‌ (తైవాన్‌) : తైవాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తైతుంగ్‌ నగరానికి వెళ్తున్న పుయ్‌మా ఎక్స్‌ప్రెస్‌ ఇలాన్‌ కౌంటీలోని జిన్మా స్టేషన్‌ వద్దకు రాగానే పట్టాలు తప్పింది. దీంతో రైలులోని 8 బోగీలు పట్టాలు తప్పగా, ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా, 132 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. 

మరిన్ని వార్తలు