ఓటు వేసిందని.. సోదరిని చంపేశాడు

1 Dec, 2015 17:06 IST|Sakshi
ఓటు వేసిందని.. సోదరిని చంపేశాడు

ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఓటు వేసినందుకు ఓ వ్యక్తి తన సోదరిని చంపేశాడు.  పాక్ రాజధాని ఇస్లామాబాద్ స్థానిక సంస్థల  ఎన్నికల సందర్భంగా ఈ విషాదం జరిగింది.

బాధితురాలు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్. ఇస్లామాబాద్లోని సరాయ్ కర్బోజా ప్రాంతంలో ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంది. దీంతో ఆగ్రహించిన సోదరుడు ఆమెను కాల్చిచంపాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు